Surprise Me!

భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

2024-07-20 86 Dailymotion

Bhadradri Water level Increased Due To Heavy Rain Fall : రాష్ట్రంలో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 24 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం మధ్యాహ్నానికి 34 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాలిపేరు, కాళేశ్వరం, సమ్మక్క సారక్క బ్యారేజీల నుంచి వరద నీరు వస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరుగుతోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరిగిన వరద భద్రాచలం స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరుకుంది.

Buy Now on CodeCanyon