Flood Effect in Andhra Pradesh: వర్షాలు తగ్గుముఖం పట్టినా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను వరద ముంపు వీడ లేదు. గోదావరిలో అంతకంతకు వరద పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద స్థాయికి వరద ప్రవాహం చేరింది. గోదావరి వరద పెరుగుతున్న కొద్దీ కోనసీమలో లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకుంటున్నాయి. వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అల్లూరి జిల్లా సైతం వరద ముంపులోనే ఉంది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందన్న వాతావరణశాఖ, రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.