Teak Wood Smuggling in Mancherial : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఇదే అదనుగా స్మగ్లర్లు టేకు కలపను తరలించేందుకు నదిని వాడుకున్నారు. దుంగలను తెప్పగా మార్చి నదిలో వదిలారు. అక్కడి నుంచి అధికారుల కళ్లుగప్పి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ముందస్తు సమాచారంతో అటవీ అధికారులు స్మగ్లర్ల ఎత్తను చిత్తు చేసి, టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
