మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టిన కేసును సీరియస్గా తీసుకున్న సర్కార్ అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తోంది. ఈ ఘటన వెనక కుట్రకోణం దాగి ఉందని భావిస్తుండగా, అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం లభించాయి. ప్రమాదానికి ముందు రెవెన్యూ సిబ్బంది కార్యాలయంలోనే ఉండటంపైనా ఆరా తీస్తోంది. ఇందులోని కుట్రకోణాన్ని వెలికితీసేందుకు పదిబృందాలను ప్రభుత్వం నియమించింది.
