Harish rao slams Congress : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆడ పిల్ల పెళ్లికి ఇచ్చే కల్యాణ లక్ష్మి చెక్కులు రాక 8 నెలలు అవుతోందని, ఎన్నికలప్పుడు లక్ష రూపాయలు, తులం బంగారం అని ప్రగల్బాలు పలికిన నేతలు, తులం బంగారం దేవుడు ఎరుగు కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు కూడా ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు