Lack Of Facilities in Mahabubnagar Colleges : శిథిలావస్థకు చేరిన భవనాలు, చాలీచాలనీ మౌలిక వసతులు, ప్రయోగాలు లేని ప్రయోగశాలలు. ఇలా అనేక సమస్యలతో, అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు. ఇటీవలి బదిలీలతో చాలాచోట్ల అధ్యాపకుల పోస్టులు ఖాళీ అయ్యాయి. అతిథి అధ్యాపకుల గడువు ముగియడంతో ఆగస్టు నుంచి వాళ్లూ రావడం లేదు. ప్రధాన వసతులు సరే, కనీసం కళాశాల నిర్వహణ నిధులైనా సరిపడా ఇస్తున్నారా అంటే అదీలేదు. మొత్తంగా ప్రభుత్వ కాలేజీల్లో సమస్యల నడుమ విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు.
