Surprise Me!

క్షమాభిక్షపై త్వరలోనే నిర్ణయం: హోంమంత్రి అనిత

2024-08-12 4 Dailymotion

Home Minister Anitha Visit Rajahmundry Central Jail: రాష్ట్ర వ్యాప్తంగా 1700 గంజాయి కేసులుంటే విశాఖలోనే వెయ్యి వరకు ఉన్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని అనిత పరిశీలించారు. ఖైదీలు, జైళ్ల సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైళ్ల సిబ్బంది, ఫైర్‌ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షమాభిక్ష కావాలని చాలామంది ఖైదీలు అడిగారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా వైఎస్ జగన్​కు భద్రత తగ్గించలేదని మరోసారి స్పష్టం చేశారు.

Buy Now on CodeCanyon