Crop Loan Waiver 2024 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని తిప్పికొట్టారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని, ఇంకెవరికైనా కాకుంటే, సందేహాల నివృత్తి కోసం అన్నదాతలు అధికారులను సంప్రదించాలని తుమ్మల సూచించారు.
