Govt Enquiry on Land Grabbing in Andhra Pradesh: ఉమ్మడి కడప జిల్లా రెవెన్యూ యంత్రాంగం వైఎస్సార్సీపీ నాయకుల భూ దందాల లెక్కలు తేలుస్తోంది. రెండు మండలాల్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని, రెవెన్యూ బృందాలు అక్రమాలపై జల్లెడ పడుతున్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు? ఎవరి ఆధీనంలో ఉండాల్సిన భూములను ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు.
