TTD has Taken Steps to Provide Quality Food to Devotees : కలియుగ వైకుంఠనాథుడ్ని దర్శించుకొనేందుకు తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందచేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు సంతృప్తికర స్థాయిలో ప్రసాదాలు అందచేయడానికి కీలక నిర్ణయాలు తీసుకొంది. ఉచిత అన్నదానంతోపాటు తిరుమలలో హోటళ్లలో సైతం నాణ్యమైన ఆహార పదార్థాలు భక్తులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు ప్రారంభించారు.