Telangana Congress Protest Against Adani Issue : సెబీ ఛైర్పర్సన్ అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గన్పార్క్ వద్ద జరిగిన నిరసనల్లో<br />ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు.
