Digging Wells in Nalgonda : గతేడాది వర్షాభావంతో నల్గొండ జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయి రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొన్నారు. వానాకాలంలోనూ సరైన వర్షాలు పడక భూగర్భజలాలు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. ఇలాంటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం పొందేందుకు కొందరు రైతులు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
