New PCC Leader In Telangana Congress : రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు ఒకటి రెండు రోజుల్లో తెరపడనుంది. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్లలో ఒకరికి సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్షునితోపాటు నాలుగైదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులనూ ఏఐసీసీ భర్తీ చేయనుంది.
