Site Inspection for Thermal Power Plant : మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రామగుండంలో మరో 1300 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ప్రాజెక్టుల స్థలాలను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించనున్నారు. జెన్కో థర్మల్-బి పవర్ స్టేషన్ స్థానంలో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ క్రిటికల్ ప్లాంటును స్థాపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ క్రమంలో మంత్రులు స్థల పరిశీలన చేయనున్నారు.
