Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation : ఊహించని వరదతో పంట నష్టపోయిన రైతులు, ఇళ్లు దెబ్బతిన్న ప్రజలకు బాసటగా నిలుస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ అభయమిచ్చారు . రాష్ట్రప్రభుత్వంతో కలిసి స్వల్పకాలికంగా , దీర్ఘకాలికంగా ఎలా ఆదుకోవాలో ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో మరో కేంద్రమంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మలతో కలిసి పర్యటించారు.
