Relief Works in Vijayawada: బుడమేరు వరద ఉద్ధృతి తగ్గడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంటోంది. వారం రోజులుగా నీటిలో నానుతున్న కాలనీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. నీటి నుంచి బయటపడిన కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది.
