CM Chandrababu Naidu Delhi Tour : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2 రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని, అలాగే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించానని అన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరామని తెలిపారు.<br /><br />
