Krishna District Liquor Shops Lottery Process Completed : కృష్ణా జిల్లాలో మద్యం టెండర్లు ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని మద్యం దుకాణాలకు ప్రశాంత వాతావరణంలో అధికారులు లాటరీ నిర్వహించారు. 123 మద్యం దుకాణాలకుగాను 2942 మంది దరఖాస్తు చేస్తుకున్నారు. జిల్లాలో మద్యం టెండర్లలో కర్నాటక, యూపీకి చెందిన వ్యక్తులు సైతం లాటరీల ద్వారా మద్యం షాపులను దక్కించుకున్నారు. దరఖాస్తుదారుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. మద్యం షాపుల లాటరీలతో రూ.58 కోట్ల 84 లక్షలు ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అధికారులు తెలిపారు.
