Annual Cyber Security Summit Hyderabad : సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో వార్షిక సైబర్ సెక్యురిటీ సమ్మిట్ - హాక్-2.0 ను ప్రారంభించిన మంత్రి నిపుణుల సలహాలు, సూచనలు, సైబర్ సెక్యూరిటీలో కీలకం అవుతాయని అన్నారు. సదస్సులో సైబర్ నేరాలపై అవగాహన కోసం చిత్రీకరించిన వీడియోలను విడుదల చేసిన మంత్రి తమ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు.