Chandrababu on Seaplane : దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. సీ ప్లేన్ పర్యాటకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఉన్నారు.
