Intensity of Cold has Increased in Telangana : రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగింది. తెల్లవారుజామున రోడ్లపై ఏమీ కనిపించలేనంతగా మంచు కమ్మేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా చలి తీవ్రత ఉందని రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని తెలిపారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్టోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి.<br /><br />