జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదానీప్రదేశ్గా మార్చేసింది. భారీ పోర్టుల నుంచి స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు వరకు అన్నీ అదానీకే కట్టబెట్టారు. ఐదేళ్లలో పోర్టులు, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు చివరకు థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా టెండర్లనూ అదానీకి కట్టబెట్టింది. మరో గుత్తేదారు లేరన్నట్లు ఐదేళ్లలో 2లక్షలా 76వేల 333 కోట్లు రూపాయల విలువైన ప్రాజెక్టులు అప్పగించింది. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక ఉన్న ‘జగన్, అదానీ’ రహస్య బంధంపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా భారీ మొత్తంలో ముడుపులు అందాయన్నది వాస్తవమేనని తేలింది.
