Adani Bribe to YS Jagan : సెకితో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని వైఎస్సార్సీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని ఏదో మతలబు ఉందని సంతకం పెట్టలేదని చెప్పారు. అయినా మర్నాడు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. దాని వెనుక అంత గూడుపుఠాణీ ఉందని అప్పడు తనకు తెలియలేదని పేర్కొన్నారు. జగన్కు అదానీ ముడుపుల వ్యవహారంపై అప్పట్లో ఏం జరిగిందో బాలినేని ఈనాడు- ఈటీవీ భారత్కి వివరించారు.