Aurobindo on 108 and 104 Services : ఏపీలో 108, 104 అంబులెన్సుల నిర్వహణలో వైఎస్సార్సీపీ సర్కార్ అరబిందో సంస్థకు అదనంగా రూ.175 కోట్లు దోచిపెట్టినట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఒక్కో అంబులెన్సు నిర్వహణకు అయిన ఖర్చు కన్నా రూ.50,000ల నుంచి రూ.60,000ల వరకు అదనంగా చెల్లించినట్లు గుర్తించింది. గ్రామీణులకు వైద్యసేవలు చేరువచేసే క్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద మొబైల్ మెడికల్ యూనిట్ల టెండర్ను నాటి జగన్ సర్కార్ అరబిందోకు అప్పగించింది.
