CM Revanth about Telangana Debt : గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, వాళ్లు పదేళ్లలో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని, సంక్షేమ పథకాలకు సైతం నిధులు ఇవ్వలేని స్థితిని కల్పించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బొచ్చెడు తప్పులు.. పుట్టెడు అప్పులుగా బీఆర్ఎస్ పదేళ్ల పాలన సాగించిందని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు 2 శాతం వడ్డీకి అప్పులు ఇస్తున్నా, 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని వేరే దేశంలోనైతే ఉరి తీసేవారని సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
