Surprise Me!

సునామీ మళ్లీ రాకు సుమీ - గంగమ్మ తల్లికి మత్స్యకారు

2024-12-26 4 Dailymotion

Vizag Gangamma Thalli Pooja : 2004 డిసెంబరు 26వ తేదీ (20 Years Of Tsunami). నాటి సునామీ సృష్టించిన బీభత్సానికి నేటితో 20 ఏళ్లు. ఈ బీభత్సం కారణంగా రాష్ట్రంలో మొత్తం 105 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ విశాఖపట్నం తీరం మాత్రం చెక్కుచెదరలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన డాల్ఫిన్‌ నోస్, సముద్రంలోకి చొచ్చుకొచ్చినట్లుండే కొండల కారణంగా విశాఖ నగరానికి నష్టం తప్పింది. ఎక్కడా ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖపట్నం మత్స్యకారులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబరు 26వ తేదీన పెదజాలారిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న రోజు పెద్దఎత్తున మత్స్యకారులు తీరం వద్దకు చేరుకుని పూజలు చేస్తున్నారు.

Buy Now on CodeCanyon