Female Police Officer Take Bribe in NTR Pensions Distribution : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ సొమ్మును రెండింతలు పెంచింది. వృద్ధులకు, వితంతువులు, ఇతరత్రాలకు రూ.4వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ.6వేలు. మంచానికి పరిమితమైన వారితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి రూ.15వేలు ఇస్తున్నారు. ఇదే అదునుగా తీసుకొని పింఛన్ పంపిణీ చేసే సమయంలో కొందరు ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు.
