Tirumala Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ ఘటనలో నిందితులను తొలిరోజు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుపతి సబ్జైలు నుంచి భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్జైన్, పొమిల్జైన్లతో పాటు శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్లను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రుయా ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అలిపిరిలోని టీటీడీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదున్నర వరకు సాగింది. నిందితులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.