Government Allocating Unique identification Numbers To Farmers : ఆధార్ కార్డు మాదిరిగానే సొంత భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం భూధార్ సంఖ్యను కేటాయిస్తోంది. భూమి హక్కులను ధ్రువీకరించే ఆధీకృత రికార్డులు కలిగిన రైతులకు మాత్రమే విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలతోపాటు బ్యాంక్ రుణాలు వంటి సౌకర్యాలకూ భూధార్ తప్పనిసరని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు సేవా కేంద్రాల్లో నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. అదే సమయంలో కౌలు రైతులు, అసైన్డ్ రైతుల పరిస్థితి ఏంటని రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
