YSRCP Ex MP Gorantla Madhav Attend Cyber Crime Police Enquiry : అత్యాచార ఘటన బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదనే విషయం తనకు తెలీదని వైఎస్సార్సీపీ నేత గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాధానమిచ్చినట్లు తెలిసింది. గతంలో కొందరు నేతలు కూడా బాధితుల వివరాలు బహిర్గతం చేశారని ఆయన పోలీసుల విచారణలో తెలిపారు. ఓ అత్యాచార ఘటనలో బాధితుల వివరాలను పత్రికా సమావేశంలో బహిర్గతం చేశారని ఆయనపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మాజీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గతేడాది నవంబర్లో విజయవాడ సీపీ రాజశేఖర బాబుకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
