AP Assembly Sessions 2025 : ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై సభాసంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. ప్రజాధనాన్ని కాజేసిన వారిని వదిలిపెట్టబోమని చెప్పారు. అలాగే రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు గత ప్రభుత్వ వైఫల్యమేనన్న మంత్రి దుర్గేష్ త్వరలో దాని పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. మే నెలలోనే అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాల్లో వేస్తామన్న అచ్చెన్న అర్హులైన అందరికీ సాయం అందిస్తామని వెల్లడించారు.
