Minister Nimmala Ramanaidu on Polavaram Funds : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కృషితో పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధికి పాటుపడుతున్నారని మంత్ర నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నేటికి కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్కు రెండు విడతలుగా రూ. 5052 కోట్ల నిధులు అడ్వాన్స్గా తీసుకువచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల తెలిపారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రియింబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్ట్ను విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు.
