Surprise Me!

'డయేరియా బాధిత గ్రామాలకు మెరుగైన వైద్యం అందించాలి'

2025-03-17 2 Dailymotion

Diarrhea in Gopalapuram of East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పలువురు సామాజిక ఆరోగ్య కేంద్రానికి క్యూ కడుతున్నారు. గత మూడు రోజుల్లో పలు గ్రామాల నుంచి 25 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఇలా వస్తున్నవారికి వెంటనే చికిత్స అందించడంతో కోలుకుని 19 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆరుగురు ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చైతన్యరాజు చెప్పారు. పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తక్షణం వైద్యసేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Buy Now on CodeCanyon