Pawan Kurnool District Tour : కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ఆయన పంట కుంట నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కదానికి ఇన్లెట్, అవుట్లెట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు సేద్యంతో పాటు వాటి చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసినట్లు వివరించారు.
