Surprise Me!

ఈ ఏడాదిలోనే ఉపఎన్నికలు - అంతా సిద్ధంగా ఉండండి : కేటీఆర్​

2025-04-20 3 Dailymotion

KTR on Election in Telangana : ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయని అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జోస్యం చెప్పారు. అత్తాపూర్​ డివిజన్​ కాంగ్రెస్​ నేత వనం శ్రీరామ్​రెడ్డి ఆయన సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వడంతో తినే కంచంలో మన్ను పోసుకున్నట్లయిందని కేటీఆర్​ అన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి మాటలన్నీ బోగస్​, ఆరు గ్యారంటీల్లో ఒకటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్​ చెప్పారు. రాష్ట్రంలో రియల్​ ఎస్టేట్​ పూర్తిగా క్షీణించిందన్నారు. ఎఫ్​టీఎల్​ పరిధిలో నిర్మాణాలున్న కాంగ్రెస్​ నేతలను హైడ్రా ముట్టుకోదని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఓటమి బీఆర్​ఎస్​ కంటే ప్రజలే ఎక్కువ నష్టపోయారని అన్నారు.

Buy Now on CodeCanyon