Ex DGP HJ Dora On Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు మృతి మావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విశ్రాంత డీజీపీ హెచ్.జె దొర అన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీకి ఎలాంటి భవిష్యత్ లేదని హెచ్.జె.దొర అన్నారు. ఛత్తీస్గఢ్ సర్కారు, కేంద్రం పక్కాగా ఆపరేషన్ చేపడుతోందని హెచ్జే దొర అన్నారు. ప్రజల నుంచి మావోయిస్టులకు మద్ధతు లేదన్నారు. ఏళ్లనాటి సిద్ధాంతాలతో ఆయుధాలు పట్టడం సరికాదన్నారు. మావోయిస్టులు లేకపోవడం వల్లే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దెబ్బలు తగిలినప్పుడే మావోయిస్టులు చర్చలను తెరపైకి తెస్తారన్నారు.
