Surprise Me!

నంబాళ్ల కేశవరావు మృతి మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ : విశ్రాంత డీజీపీ హెచ్​జేదొర

2025-05-21 16 Dailymotion

Ex DGP HJ Dora On Chhattisgarh Encounter : ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు మృతి మావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విశ్రాంత డీజీపీ హెచ్​.జె దొర అన్నారు. దేశంలో మావోయిస్టు పార్టీకి ఎలాంటి భవిష్యత్​ లేదని హెచ్​.జె.దొర అన్నారు. ఛత్తీస్​గఢ్​ సర్కారు, కేంద్రం పక్కాగా ఆపరేషన్​ చేపడుతోందని హెచ్​జే దొర అన్నారు. ప్రజల నుంచి మావోయిస్టులకు మద్ధతు లేదన్నారు. ఏళ్లనాటి సిద్ధాంతాలతో ఆయుధాలు పట్టడం సరికాదన్నారు. మావోయిస్టులు లేకపోవడం వల్లే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దెబ్బలు తగిలినప్పుడే మావోయిస్టులు చర్చలను తెరపైకి తెస్తారన్నారు.

Buy Now on CodeCanyon