<p>Municipal B-Form Issue In Jagtial : జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య వివాదం తలెత్తింది. 29వ వార్డు అభ్యర్థికి చెందిన బీఫామ్ను మరో అభ్యర్థి భర్త చించివేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొదటగా 29వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థిగా లావణ్య అనే మహిళ బీఫామ్ పొందారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్కు లావణ్య తన బీఫామ్ అందజేస్తుండగా ఆరుముల్ల పవన్ అనే వ్యక్తి లాక్కుని చించివేశారు. 29వ వార్డు నుంచే ఆరుముల్ల పవన్ భార్య తేజస్విని కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆరుముల్ల తేజశ్విని పేరిట జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్య మరో బీఫాం ఇచ్చారు. దీంతో బీఫామ్ సమర్పణ సమయంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య గొడవతో ఉద్రిక్తత తలెత్తింది. వివాదం చెలరేగడంతో అప్రమత్తమైన జగిత్యాల టౌన్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అభ్యర్థులను కార్యాలయం నుంచి బయటకు పంపారు. తన బీఫామ్ చించివేశారని లావణ్య కన్నీరుమున్నీరయ్యారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇలా చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు నుంచి పార్టీలో కష్టపడ్డానని చెప్పారు.</p><p>'పోలీసులు నన్ను బెదిరించి నామినేషన్ ఉపసంహరింపజేశారు' : బీజేపీ అభ్యర్థి కంప్లైంట్</a></p><p>రసవత్తరంగా పురపాలక పోరు - పట్టునిలుపుకునేందుకు రాజకీయ పార్టీల వ్యూహాలు</a></p>
