<p>Tiger Roaming in Rajamahendravaram at East Godavari : రాజమహేంద్రవరం గ్రామీణం కోరుకొండ సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. జాడ కోసం అటవీ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే అధికారులు పాదముద్రలను గుర్తించారు. పులి ఆచూకీ కోసం డ్రోన్ను వినియోగిస్తున్నారు. పులి జాడ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. పులిని సురక్షితంగా అటవీ మార్గానికి మళ్లించేందుకు యత్నిస్తామని చెబుతున్న రాజమహేంద్రవంరం సీసీఎఫ్ మూర్తితో మా ప్రతినిధి ముఖాముఖి. </p><p>"రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. మాకు వచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ ఆఫీసర్స్ సహకారంతో పులి ఆచూకీ కోసం డ్రోన్ను వినియోగిస్తున్నాం. చుట్టుపక్కల గ్రామస్థులను అప్రమత్తం చేశాం. ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పెద్దపులి రాత్రులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. థర్మల్ డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నాం. సాధారణంగా పెద్దపులులు ఉచ్చులో పడిన సందర్భాలు చాలా తక్కువ." - మూర్తి, అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి </p>
