<p>Group-1 Topper Chandini From Tirupati: సాధారణంగా విద్యార్థులు బీటెక్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్తారు. కానీ ఆ యువతి అందుకు భిన్నం. లక్షల రూపాయల ప్యాకేజీలతో ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు వచ్చినా ప్రభుత్వ కొలువు సాధించి ప్రజాసేవ చేయాలని నిరంతరం శ్రమించింది. చాలామంది ఒక ప్రభుత్వ కొలువు వస్తేనే సంతృప్తి చెందుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఒకేసారి 3 కొలువులు సాధించి ఔరా అనిపించింది. అందులో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించి తన కలను నెరవేర్చుకుంది. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తానంటున్న తిరుపతికి చెందిన చాందిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.</p><p>"బీటెక్ అయిన తర్వాత నాకు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి. కానీ నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ వైపు వెళ్లాలనుకునే ఉద్దేశంతో ఆ ఉద్యోగాలను వదులుకుని సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. భవిష్యత్తులో సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనేది నా ప్రధాన ధ్యేయం"-చాందిని గ్రూప్-1 విజేత</p><p>విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగం - తెలుగోడి సక్సెస్ సీక్రెట్స్ ఇదే</a></p><p>'ల్యాప్టాప్తో పాటు లాఠీ పట్టాలి' - చంద్రబాబు స్ఫూర్తితో జాబ్ సాధించిన అయ్యూరి బ్యూలా</a></p>
