<p>Minister Ponnam Drives an Auto : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. అక్కడే స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. హుస్నాబాద్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అదే విధంగా సోమవారం హుస్నాబాద్లోని వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, కళ్ల చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణంలో రహదారి, మురుగు కాలువల నిర్మాణాలను చేపడతామని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.</p>
