<p>Cyber Frauds through Instagram : ఇన్ట్గ్రామ్లో వచ్చిన యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయానని ఒకరు పోలీసులను ఆశ్రయించిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం చీరాల పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన హనుమకొండ గోపి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన నోటిఫికేషన్ చూసి రూ. 24,16,000 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత దానికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా ఆగిపోవడమే కాకుండా అందులో ఉన్న ఫోన్ నంబరు పని చేయడం లేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. </p><p>హనుమకొండ గోపి చెన్నైలో బ్యాంకింగ్ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో స్టాక్ మార్కెట్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. వాళ్లతో చాట్ చేసిన తర్వాత కాప్స్టోనిన్ అనే మొబైల్ యాప్ ద్వారా వాట్సప్లో మాట్లాడాలని చెప్పారు. వాట్సప్లో గ్రూప్ చాట్ జరిగింది. మొదట కొంత నగదు కట్టమన్నారు. అలా కొద్ది కొద్దిగా కట్టాలని చెప్పారు. మొత్తం 24 లక్షల 15 వేలు కట్టించారు. విత్డ్రా కావాలని గోపి అడిగినపుడు ఇంకా కట్టాలని చెప్పారు. చివరికి బాధితుడు మోసపోయానని గ్రహించారు. సైబర్ కేసు పెట్టారని తెలిపారు. ఇలాంటి యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. </p>
