<p>Idi Sangathi Story on Tirumala Introduces Hi-Tech Food Lab: తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యత, పవిత్రతను కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఫుడ్, వాటర్ అనాలసిస్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసింది. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రసాదాలకు వినియోగించే ముడిసరుకుల నాణ్యతను నిర్ధారించేందుకు వీలుగా తిరుమలలో ల్యాబ్ను నిర్మించారు. </p><p>సూక్ష్మ స్థాయిలో పరిశీలన: కొన్ని సంవత్సరాలుగా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, ముడిసరుకుల కల్తీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ల్యాబ్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ, టీటీడీల సంయుక్త ఆధ్వర్యంలో ల్యాబ్ నిర్వహించనున్నారు. శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు తదితర ముడిసరుకుల్లో కల్తీని సూక్ష్మ స్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. </p><p>50 రకాల పరీక్షలు చేసే యంత్రాలు: నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ వంటి పదార్థాలతో పాటు పాలు, నూనెల్లో రసాయన వ్యర్థాలు, భార లోహాలు వంటి అవశేషాలను యంత్రాలు సులువుగా గుర్తించనున్నారు. గరిష్ఠంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేసే సామర్థ్యంతో యంత్రాలు ఏర్పాటు చేశారు. ముడిసరుకులతో పాటు భక్తులకు అందించే జల ప్రసాదాల నమూనాలను పరీక్షించనున్న తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.</p>
