<p>War Crisis On Petrol Bunks : ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రభావంతో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందని ఇటీవల ప్రచారం జోరుగా జరగుతోంది. దీంతో వినియోగదారులు బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు.</p><p>తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, దేవరపల్లి, గోపాలపురం, త్యాజంపూడి, ఇతర ప్రాంతాల్లో బంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. బంకు దగ్గరకు వెళ్లిన వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ లేదని సమాధానం రావడంతో మిగతా ప్రాంతాల్లో బంకుల వద్దకు వెళ్తున్నారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెంలోని సొసైటీ బంకు వద్దకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, డబ్బాలు,సీసాలతో వినియోగదారుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. డీజిల్, పెట్రోల్ విషయంలో అసత్య ప్రచారం ముమ్మారంగా జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు స్పందించడం లేదని వాహనదారులు ,వినియోగదారులు మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ విషయంపై అధికారులు స్ఫందిస్తే పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. </p>
