Surprise Me!

మిగిలిపోయిన పులిహోర తిని 70 మందికి అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు

2026-03-24 1 Dailymotion

<p>Food Poision In Nandyal  : నంద్యాల వైఎస్సార్‌ నగర్‌ సమీపంలోని బుడగ జంగాల కాలనీలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుక నుంచి తెచ్చిన పులిహోరను ఓ వ్యక్తి కాలనీవాసులకు పంచారు. అది తిన్న వారందరూ తెల్లారేసరికి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇళ్లకు చేరారు. కొంతమంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కొంతమందికి సెలూన్ బాటిల్స్ ఎక్కించి చికిత్స చేస్తున్నారు.</p><p>"రాత్రి మిగిలిన ఆహారం తిన్న కొద్ది సేపటికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు గురయ్యాం. దాదాపు 70 మందికి పైగా పెళ్లిలో మిగిలిన చిత్రాన్నం తిని ఆసుపత్రిలో చేరాం. కొందరికీ తగ్గింది, ఇంకొందరు చికిత్స పొందుతున్నారు. ఒకరు ఐసీయూలో అడ్మిట్​ అయ్యారు". -అస్వస్థతకు గురైన వ్యక్తి</p>

Buy Now on CodeCanyon