Surprise Me!

అమరావతి చట్టబద్ధతకు కీలక అడుగు - సంతోషంలో రాజధాని రైతులు

2026-04-01 6 Dailymotion

<p>Amaravati Farmers Celebrating On Central Government Introduces Bill In Parliament :  ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన సందర్భంగా రాజధానిలో రైతుల ఆనందానికి అవధుల్లేవు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టడంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్టసవరణతో ముగింపు పలుకుతుందని రైతులు అంటున్నారు. బిల్లు పెట్టడంతో తుళ్లూరులో రైతన్నలు మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. పార్లమెంటులో త్వరగా బిల్లు ప్రవేశపెట్టేలా చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు 'మవిగన్' పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలన్న జగన్ వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో రాజధాని అని మరో కొత్త  నాటకం ఆడుతున్నారని జగన్​పై అమరావతి రైతులు విమర్శలు గుప్పించారు.</p>

Buy Now on CodeCanyon