Surprise Me!

'మీరే ఆ కుర్చీలో కూర్చోవాలి' - పెద్దలపై ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్న మంత్రి నారా లోకేశ్‌

2026-04-04 12 Dailymotion

<p>Nara Lokesh Rejects Special Chair in Karnataka Tour: తనకంటే పెద్దలపై ఉన్న అపారమైన గౌరవాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మరోసారి చాటుకున్నారు. కర్ణాటకలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ సింధనూరులో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్‌ కోసం నిర్వాహకులు వేదికపై ప్రత్యేకంగా పెద్ద కుర్చీని వేశారు. కానీ దాని పక్కనే కేంద్ర మంత్రి కుమార స్వామి సాధారణ కుర్చీలో ఆసీనులై ఉన్నారు. కానీ లోకేశ్​ను ప్రత్యేక కుర్చీలో కూర్చోవాలని కేంద్ర మంత్రి కుమారస్వామి సూచించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్‌ ‘పెద్దవాళ్లు మీరే ఆ కుర్చీలో కూర్చోవాలి’ అని సవినయంగా కేంద్ర మంత్రి కూమారస్వామితో చెప్పారు. అయినా కుమారస్వామి మాట వినలేదు. దాంతో చివరకు లోకేశ్‌ సాధారణ కుర్చీని వేయించుకుని అందులో కూర్చున్నారు. దాంతో పెద్దలపట్ల గౌరవప్రదంగా వ్యవహరించిన లోకేశ్‌ కార్యకర్తలు, అభిమానుల మనసులను చూరగొన్నారు. </p>

Buy Now on CodeCanyon