<p>Prominent Personalities Who Visited Tirumala : తిరుమల శ్రీవారిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. గురవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన చాగంటి, ఎల్వీ సుబ్రమణ్యం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. రాబోయే టోర్నమెంట్ల కోసం శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని పీవీ సింధు అన్నారు. </p><p>దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు. ఆలయంలో శ్రీమహావిష్ణువుగా అలా నిలబడాలని స్వామివారు నిలబడ్డారని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్వామివారు సుదర్శన చక్రం పట్టుకొని అలా నిలబడి అందరిని కాపాడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం ఉందని, జగన్నాథుడు వేంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉండటం వల్ల మనం ప్రశాంతంగా ఉన్నామన్నారు.</p>
