<p>A Car Hit Divider at Bheemili Beach : విశాఖ జిల్లా భీమిలిలో అర్థరాత్రి ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ భాగం నుజ్జునుజ్జైంది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిదానమే ప్రధానమని పోలీసులు మొత్తుకుంటున్నా ఇలాంటివి వాహన చోదకులకు చెవికెక్కడం లేదు. భీమిలి బీచ్ రహదారి మీదుగా కారులో రాత్రి చోదకుడితో పాటు ముగ్గురు వ్యక్తులు విశాఖ వెళ్తున్నారు. ఈ క్రమంలో కే.నగరపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి కారు అతి వేగంతో అదుపుతప్పి టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఓవ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఈ యాక్సిడెంట్కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం తర్వాత హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భీమిలి బీచ్ పోలీసులు, స్థానికులు గాయపడిన నలుగురిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాను పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేశారు. </p>
