<p>A Tirupati Girl Got Seat in Ahmedabad IIM University : కలలు కనడం సులువే కానీ వాటిని సాకారం చేసుకోవాలంటే దానికి కఠోర శ్రమ తోడు కావాలి. చదువుకు ఐదేళ్ల గ్యాప్ వచ్చినా బంధువుల నుంచి సూటిపోటి మాటలు ఎదురైనా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు ఆ యువతి. తనకు ఉన్న ప్రతిభతో సమాజానికి సేవ చేయాలని సివిల్స్ పరీక్షలు కూడా రాసింది. కానీ తాను ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవడంతో ఎంబీఏ చేయాలని నిర్ణయించుకుంది. కష్టపడి చదివి తన లక్ష్యం వైపు గురిపెట్టి ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్ అయిన అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు దక్కించుకుని సత్తా చాటింది. క్యాట్ పరీక్షలో 99.62 పర్సంటైల్ సాధించింది. ఇందులో ప్లేస్మెంట్ సంపాదించుకునేందుకు చాలా మాక్ ఇంటర్వూల్లో పాల్గొంది. అంతేకాకుండా అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన గీతి శ్రేయ సీటు కోసం ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలుసుకుందాం!</p>
