Surprise Me!

నెల్లూరు జిల్లాలో 'మహానాడు' - స్థలం పరిశీలించిన టీడీపీ నేతలు

2026-05-01 6 Dailymotion

<p>Mahanadu Arrangements in Nellore District : టీడీపీ మహానాడుకు నెల్లూరు జిల్లా వేదిక కానుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు కోసం కోవూరు, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ప్రాంతాల్లో టీడీపీ నేతలు వేదిక స్థలాలు పరిశీలన చేశారు. కొడవలూరు ఇఫ్కో సెజ్, కనపర్తిపాడులో పరిశీలించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థలాల పరిశీలన చేశారు.</p><p>అయితే మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఘనంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించాలని పార్టీ ముందుగా నిర్ణయించుకుంది. శ్రీకాకుళంలో ఈ వేడుకను నిర్వహించేందుకు పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కూడా ఏర్పడింది. కానీ, జూన్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, అలాగే ఉత్తరాంధ్రలో పలు కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడానికి రాష్ట్రానికి రాబోతుండటంతో ఈ విషయం మరోసారి పునరాలోచనలోకి వచ్చింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, మహానాడు నిర్వహణ రెండూ ఒకే ప్రాంతంలో ఉంటే సాంకేతిక సమస్యలు, నిర్వహణలో ఇబ్బందులు కలగవచ్చని పార్టీ అధిష్ఠానం భావిచింది. దీంతో టీడీపీ మహానాడును అధిష్టానం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాకు మార్చింది.</p>

Buy Now on CodeCanyon